కేబుల్ బ్రిడ్జి అంశంపై కేంద్రమంత్రులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రోడ్డు రవాణా శాఖా మంత్రి వర్యులు నితిన్ గడ్కరీకి లేఖలు పంపారు. రాయలసీమ ప్రాంతంలో త్రాగు నీరు , వ్యవసాయం , పశుసంపద ఉన్నాయన్నారు. రాయలసీమ ప్రాంత వాసుల నుండి వినిపిస్తున్న అభ్యర్థనలు పరిశీలించాని ఆయన లేఖలో పేర్కొన్నారు.వెనుకబడిన ప్రాంతం ప్రయోజనాల దృష్ట్యా కేబుల్ బ్రిడ్జి స్థానంలో బ్రిడ్జి కం బ్యారేజ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. త్వరలోనే స్వయంగా ఢిల్లీ వచ్చి అన్ని అంశాలను వివరిస్తానన్నాని తెలిపారు.