ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమవారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 09:16 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి  ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమవారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. మంగళవారం అక్కడ జరగనున్న జీ-20 సన్నాహక సదస్సులో ఆయన పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సులో సీఎం పాల్గొనడంపై ముందస్తు సమాచారమేదీ లేదు. శనివారం అకస్మాత్తుగా ఇది తెరపైకి వచ్చింది. అనూహ్యంగా జగన్ ఢిల్లీ వెళ్లడంపై రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీమంత్రి వివేకానందరెడ్డి   హత్య కేసులో మరో అధ్యాయం మొదలైంది. ఈ కేసులో ముందు నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్‌‌రెడ్డిని సీబీఐ అధికారులు మొట్టమొదటిసారిగా ప్రశ్నించారు. శనివారం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో నాలుగున్నర గంటలపాటు అవినాశ్‌‌రెడ్డిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఖాయమని, వివేకా కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయల్సిందిగా కేంద్ర పెద్దలను కలవడం ఖాయమని ఊహాగానాలు జోరందుకున్నాయి. దీనికి అనుగుణంగానే సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com