మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ను భారత మహిళా క్రికెట్ జట్టు గెలుచుకుంది. ఆదివారం ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత జట్టు 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో భారత అండర్-19 జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్లో భారత్కు ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ.