ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్..అదే రీతిలో అందానీ గ్రూప్స్

business |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 12:06 AM

ఈ ఏడాది 2022లో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంటే వెనుకబడింది. ఇప్పటివరకు దేశీయ దిగ్గజంగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ ఐదేళ్ల కాలంలో చూసుకుంటే గనుక సంపద సృష్టిలో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. తన స్థానాన్ని నిలుపుకుంది. తన ట్రెడిషనల్ లీడర్ అన్న స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. అయితే అదానీ కంపెనీలు ఈ ఏడాది భారీగా లాభపడ్డాయి.


ఈ ఏడాదిలో గౌతమ్ అదానీకి చెందిన ఎన్నో కంపెనీలు రికార్డు సృష్టించాయి. ఇదే క్రమంలో అదానీ సంపద కూడా భారీగా పెరగడం గమనార్హం. సెప్టెంబర్ 16న ఫోర్బ్స్ రియల్‌టైమ్ బిలియనీర్స్ జాబితాలో 155.7 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ రోజు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్ స్టాక్స్ భారీగా పెరగడమే దీనికి కారణం.


ఈ 3 కంపెనీల్లో (అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్‌మిషన్) అదానీకి 75 శాతం వాటా ఉంది. ఈ సంస్థల నుంచే 2022 సంవత్సరంలో 79 బిలియన్ డాలర్ల సంపద అదానీకి లభించింది. ఆయన కంటే ముందు ఎలాన్ మస్క్ ఒక్కరే ముందున్నారు. అయితే ఆ తర్వాత మళ్లీ అదానీ మూడో స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం మాత్రం ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫ్యామిలీ ఉంది.


ముకేశ్ అంబానీని వెనక్కినెట్టి ఈ ఫిబ్రవరిలో తొలిసారి ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అవతరించారు అదానీ. ఏప్రిల్‌లో 100 బిలియన్ డాలర్ల సంపద క్లబ్‌లోకి ప్రవేశించారు. గత నెలలో ప్రపంచ కుబేరుల్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి.. నాలుగో స్థానానికి చేరారు గౌతమ్ అదానీ. తర్వాత జెఫ్ బెజోస్‌ను కూడా వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరారు.


గౌతమ్ అదానీకి.. అదానీ టోటల్ గ్యాస్‌లో 37 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో 65 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 61 శాతం వాటా ఉంది. అదానీతో పోలిస్తే అంబానీ ఈ ఏడాది నికర సంపదలో, సంపద సృష్టిలో వెనుకబడ్డారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ 92.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు. 2017-22 మధ్య కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ అత్యంత వేగవంత, పెద్ద, స్థిరంగా సంపదను సృష్టించి కంపెనీలుగా నిలిచాయని మోతీలాల్ ఓస్వాల్ తన నివేదికలో వెల్లడించింది. అన్నింటా అదానీ కంపెనీలే ఉన్న తరుణంలో.. మరోవైపు ఎలాన్ మస్క్ సంపద పడిపోతున్న క్రమంలో త్వరలో గౌతమ్ అదానీ టాప్‌లోకి ప్రవేశించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com