ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ర్టిక్‌ బస్సు పై ఆరా తీసిన ఆర్టీసీ ఎండీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:59 AM

ఎలక్ర్టిక్‌ బస్సులో ప్రయాణమెలా ఉందని ప్రయాణికులను ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రశ్నించారు. తిరుమలకు వెళుతున్న ఆయన మార్గమధ్యంలోని అలిపిరి బాలాజీ బస్టాండులోని ఓ ఎలక్ర్టిక్‌ బస్సును సోమవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. శబ్ద, వాయు రహితంగా ఉండటంతోపాటు ఇంధనం ఖర్చు తగ్గుతుందని భావించి అత్యాధునిక పరిజ్ఞానంతో ఆకర్షణీయంగా ఈ బస్సును తీసుకురావడం జరిగిందన్నారు. నూతన అనుభూతి కలుగుతోందని, సౌకర్యంగా ఉందని ప్రయాణికులు తెలిపారు. అనంతరం ఎలక్ర్టిక్‌ బస్సు చార్జింగ్‌ స్టేషన్‌ వద్దకెళ్లారు. కంపెనీ ప్రమాణాల ప్రకారం నిర్దేశించిన సమయంలోనే బస్సులకు చార్జింగ్‌ అవుతోందా.. రోజుకు ఎన్ని ట్రిప్పులు నడుపుతున్నారని ఆరా తీశారు. ఈ నెలాఖరుకు ఎన్ని బస్సులు రావచ్చని మేగా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ లిమిటెడ్‌ కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అలిపిరి డిపో పరిధిలో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిభ చూపిన కండక్టర్లుకు, డ్రైవర్లకు, గ్యారేజీ సిబ్బందికి, మెకానిక్స్‌కు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం తిరుమలకు బయల్దేరి వెళ్లారు. రాత్రికి బసచేసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని కడపకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రధాన కార్యాలయ ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మానందరెడ్డి, కడపజోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గోపీనాథ్‌రెడ్డి, జిల్లా ప్రజారవాణా అధికారి చెంగల్‌రెడ్డి, అధికారులు భాస్కర్‌, నరసింహులు, హరిబాబు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com