ఈ నెల 22న కుప్పంలో ఏపీ సీఎం జగన్ చేపట్టాల్సిన పర్యటన వాయిదా పడింది. 23వ తేదీన కుప్పంలో సీఎం జగన్ పర్యటిస్తారని అధికార వర్గాలు మంగళవారం ప్రకటించాయి. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించాలని జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.