వైద్య రంగంలో భారీ మార్పులు చేపట్టి.. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. 'గత ప్రభుత్వం చెల్లించని ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ మేం అధికారంలోకి వచ్చాక చెల్లించాం. ఆరోగ్య శ్రీలో వైద్య చికిత్సలను 3,118కి పెంచాం. ప్రతి గ్రామంలో వైయస్సార్ విలేజ్ క్లినికు ఏర్పాటు చేస్తున్నాం . మూడేళ్లలో వైద్య రంగంలో 45వేల ఉద్యోగాలు కల్పించాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం' అని చెప్పారు.