ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిరప కూరగాయల నర్సరీలను తనిఖీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 06:30 PM

ఈరోజు జిల్లా ఉద్యాన శాఖ అధికారి  యం వెంకటేశం గూడెపహాడ్ లో వున్న మిరప మరియు కూరగాయల నర్సరీలను తనిఖీ చేయడం జరిగింది ఈ  తనిఖీలలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నర్సరీ యజమానులకు నర్సరీ చట్టం 2017 ప్రకారం మొక్కల యొక్క నాణ్యత రిజిస్టర్ మెయింటైన్ చేయడం మొక్కలు కొనుగోలు చేసిన రైతులకు విధిగా బిల్లు ఇవ్వడం తదితర విషయాల పైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది నియమ నిబంధనలు పాటించని యెడల చట్టం ప్రకారం నరసరి యజమానుల పైన 50 వేల జరిమానా లేదా లైసెన్స్ లను రద్దు చేస్తానని హెచ్చరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి టెక్నికల్ రాకేష్ గారు ఉద్యాన అధికారి పరకాల మధులిక గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయిల్పం తోటలను కూడా పరిశీలించి రైతులకు వాళ్ళు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఆయిల్ ఫామ్ సాగు కొరకు రైతులు ముందుకు రావాలని ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీని సద్వినియోపరుచుకోవాలని కోరడం జరిగింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com