గిరిజన గురుకుల పాఠశాల కళాశాల అద్దె భవనాల కిరాయి చెల్లించాలని, సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఆర్ సి ఓ జాను నాయక్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరో స్ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాల అద్దె భవనాలకు గత తొమ్మిది నెలల నుండి రెంటు చెల్లించకపోవడంతో గురుకుల పాఠశాల అద్దె భవనాలకు యాజమాన్యాలు అనుమతించలేని పరిస్థితి నెలకొంది అన్నారు.
అలా చేయడం వలన విద్యార్థులు పాఠశాలల కళాశాలకు రాలేక ఇంటి వద్ద ఉండే పరిస్థితి నెలకొంది , అదేవిధంగా వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలకు సొంత భవనాలు ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా కోరారు.