ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుంటను తలపిస్తున్న ప్రెస్ కాలనీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 12, 2024, 04:00 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవరకొండ రోడ్డులో గల ప్రెస్ కాలనీ వెనక భాగంలో నీరు చేరి గుంటలుగా మారాయి. మెగాసిటీ కాలనీలో సోనీ ఇల్లు ఆనుకొని పూర్తిగా వర్షం నీరు నిలిచిపోయింది. పక్కనే ఓ వెంచర్ నిర్వాహకులు వర్షపు నీరు వెళ్లకుండా అడ్డంగా గోడ కట్టేయడం,మరి కొందరు152 సర్వేనెంబర్ కబ్జా చేసుకుని గోడలు కట్టేయడంతో వర్షం నీరు వెళ్లకుండా నిలిచిపోయింది .
దీంతో కుంటలుగా ఏర్పడి ,విష సర్పాలు వంటివి చేరుతున్నాయి. నీరు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తుండడం, రోగాలకు నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొలుముంతలపాడు గ్రామానికి ఇక్కడి నుండే కాలినడకన ,ద్విచక్ర వాహనాలపై వెళుతుంటారు. కానీ ఇప్పుడు రాకపోకలు ఆగిపోయాయి. స్థానికులు ఎంపీడీవో రాంరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నీటి నిల్వను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com