సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ.. నిరంకుశత్వాన్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం.. భారతదేశంలో కలిసిన రోజు. అయితే ఈ సెప్టెంబర్ 17వ తేదీ అనేది ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న సెప్టెంబర్ 17వ తేదీ విషయంలో మాత్రం.. ఈ రచ్చ తప్పడం లేదు. ఇక ఈ రోజును ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ ఉంటుంది. దీంతో జనాలు మాత్రం ఏం చేయాలో అర్థం కాక
ఈ నేపథ్యంలోనే తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఈ సెప్టెంబర్ 17 ఏర్పాట్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ రోజును తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయించింది. ఈ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇక రాష్ట్రంలోని మిగితా 32 జిల్లాల్లో కూడా మంత్రులు జెండాలు ఎగురవేసి.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ క్రమంలోనే 32 జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
గత కొన్ని ఏళ్లుగా సెప్టెంబర్ 17 నిర్వహణపై తెలంగాణలో తీవ్ర వివాదం నెలకొంటున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పేర్కొంటూ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర ప్రభుత్వం అధికారక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపింది.