చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసినట్లు వెల్లడించింది. తద్వారా 111.72 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.చెరువుల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్గా ఉన్నారు. కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సహా పలు నిర్మాణాలను కూల్చివేసింది.