సిద్ధిపేట జిల్లా కోహేడ మండలం వింజపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాఠశాలకు విద్యా వాలంటరీ నియామకం కోసం గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకుడు, అడ్వకేట్ అన్నాడి జీవన్ రెడ్డి ఆర్థిక చేయూత అందించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం గత కొన్నేళ్లుగా తన మిత్రులతో కలిసి కృషి చేస్తున్నానన్నారు.
గతంలో కూడా విద్యా వాలంటరీ ని నియమించామన్నారు. ప్రతినెల 4000/- తన వంతు గా విద్యా వాలంటరీ కి ఇస్తా అన్నారు.ఇది వరకే పాఠశాల అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఆకర్షించేందుకు పాఠశాల గోడలపై పెయింటింగ్స్, పాఠశాల ఆవరణలో మొరం పోయించడం, పిల్లల కోసం బెంచీలు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జీవన్ రెడ్డిని గ్రామస్తులు, మిత్రులు ఉపాధ్యాయులు అభినందించారు.