సంగారెడ్డి నుంచి ప్రకాశం జిల్లా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో.. యువతిపై అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ బస్సు డ్రైవర్. కామంతో మదమెక్కి ఉన్న ఆ డ్రైవర్.. కదులుతున్న బస్సులోనే.. యువతి నోట్లో గుడ్డలు కుక్కి.. నోరుమూసి మరీ అత్యాచారం చేశాడు. మిగతా ప్రయాణికులు చూస్తారన్న భయం కూడా లేకుండా ఈ పనికి తెగబడ్డాడు.
నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు 36 మంది ప్రయాణికులతో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. తెల్లవారుజామున.. బస్సు హైదరాబాద్ శివార్లలోకి చేరుకున్న సమయంలో.. ప్రయాణికులంతా గాడ నిద్రలో ఉండగా ఆ బస్సు సెకండ్ డ్రైవర్ కృష్ణ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి వద్దకు వెళ్లి అరవకుండా ఉండేందుకు ఆమె నోట్లో గుడ్డలు కుక్కాడు. కదులుతున్న బస్సులోనే.. చుట్టూ ప్రయాణికులు కూడా ఉన్నారన్న భయం లేకుండా డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అందరూ గాఢ నిద్రలో ఉండటం.. శబ్ధం చేయకుండా నోట్లో గుడ్డలు కుక్కటంతో.. మిగాతవారు ఈ దారుణాన్ని గమనించలేకపోయారు.
అయితే.. బాధిత యువతే ఆ ఘటన నుంచి చేరుకుని.. మేడ్చల్ ప్రాంతంలో ఉండగా 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో.. వెంటనే రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు.. బాధితురాలి మొబైల్ లోకెషన్ సాయంతో బస్సును ఛేజ్ చేశారు. అయితే.. ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చిందని తెలిసి.. డ్రైవర్ మెట్టుగూడ ప్రాంతంలో దిగి పారాయ్యాడు. అనంతరం.. తార్నాకలో ఓయూ పోలీసులు ఆ బస్సును ఛేజ్ చేసి బస్సును పట్టుకున్నారు.
భాదిత యువతి దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కంప్లైంట్ ఫైల్ చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం చేసిన డ్రైవర్ పరారీలో ఉండగా.. మరో డ్రైవర్ సిద్ధయ్యను అదుపులోకి తీసుకున్నారు. బస్సును సీజ్ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.