ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వర్ణాంధ్ర@2047 ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నామన్న మంత్రి నాదెండ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 02:34 PM

గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర@2047 సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ, అమరావతి నిర్మాణం, సేవ, ఉపాధిపై సమీక్ష నిర్వహించామని... స్వర్ణాంధ్ర@2047 ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నామని వెల్లడించారు. యువతకు ఉపాధిపై సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారని చెప్పారు. చేనేత, పర్యాటక కేంద్రంగా గుంటూరు జిల్లా అభివృద్ధికి అధికారులు సూచనలు చేశారని... నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com