రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 2024 మలివిడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.