ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడంలో డ్రైవర్ల పాత్ర చాలా కీలకమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ అలం అన్నారు. ఆర్టీసీ డిపోలో మంగళవారం నిర్వహించిన ప్రమాద రహిత వారోత్సవాల ముగింపులో ఆర్టీసీ ఆర్ఎం సాల్మన్ తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సర్వీసులో ఒక్క ప్రమాదాన్ని చేయకుండా ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్పించిన డ్రైవర్లను శాలువా పూలమాలతో సత్కరించి మెమెంటోలను అందజేశారు.