జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న పైడిపల్లి హనుమాన్ దేవాలయంలో జన్నారం హనుమాన్ భక్త బృందం సభ్యులు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఆషాడ మాసం ముగింపు సందర్భంగా మంగళవారం ఉదయం జన్నారం హనుమాన్ భక్త బృందం సభ్యులు, హనుమాన్ భక్తులు ఆ దేవాలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు అనంతరం భక్తుల సమక్షంలో వారు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.