తాను చనిపోతూ అవయవదానం చేసి మరో నలుగురికి ప్రాణం పోసిన మెట్టు ప్రవీణ్ (పెద్దమల్లారెడ్డి) కుటుంబానికి ఎస్. ఆర్ ఫౌండేషన్ సభ్యులు అండగా నిలిచారు. ఇంటిపై కప్పుల కోసం సోమవారం రూ. 20వేలు అందించిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డికి ప్రవీణ్ భార్య రేఖ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్దమల్లారెడ్డి సొసైటీ చైర్మన్ రాజాగౌడ్, సతీష్ రెడ్డి, సాయగౌడ్, లింగంపేట స్వామిగౌడ్, వెంకట్ స్వామిగౌడ్, సుదర్శన్ గౌడ్, రవీందర్ గౌడ్ ఉన్నారు.