నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పంటల సీజన్లో విద్యుత్ ట్రాన్స్ఫారం కాలిపోయిన రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆమ్ ఆద్మీ పార్టీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యంపల్ల పురుషోత్తం రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ లోని 4 మండలాలకు ఒకేఒక్క ట్రాన్స్పోర్ట్ వాహనం ఉండడం, ట్రాన్స్ఫారం రిపేర్ కొరకు ప్రతి రైతుకు రూ. 1000 ఖర్చు తోపాటు 20 రోజులు ఎదురు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.