బోథ్ మండలం కరత్వాడ చెరువు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండిపోయింది. దీంతో అలుగు పారుతోంది. నీటితో పాటు చేపలు సైతం అలుగు దూకాయి. గమనించిన కరత్వాడ గ్రామస్థులు వలలతో చేపలను పట్టుకున్నారు. బోథ్ తో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వలలు, దోమ తెరలు, చీరలు పట్టుకొని చేపలు పట్టారు. కొంత మంది జాలర్లు అక్కడే ప్రజలకు విక్రయించారు. తాజా చేపలు దొరకడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు ఎగబడ్డారు.