ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్తున్న డైమండ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ముందుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు ఢీ కొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో అదిలాబాద్ కు చెందిన అప్సర్ ఖాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. సంఘటన స్థలానికి పోలీసులు వెంటనే చేరుకుని క్షతగాత్రులను 12 అంబులెన్స్ లలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.