అంతర్గత కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి ప్రాధాన్యమిస్తామని అయిజ మున్సిపల్ చైర్మన్ దేవన్న పేర్కొన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని పదో వార్డులో ఆయన పర్యటించారు. వార్డుల పర్యటనలో భాగంగా సమస్యల పరిష్కారానికి పలు రకాల కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. తాగునీరు, సిసి రహదారులు, మురుగు కాలువలు తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.