గొర్రెల కాపరిని భార్యే హత్య చేయించినట్లు సోమవారం జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి తెలిపారు. రాజీవ నగర్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి, చిన్న ఆంజనేయులు (46) దంపతులు. పెద్ద కుమార్తె ఓ వ్యక్తితో చనువుగా ఉండటంతో తండ్రి మందలించాడు. ఈ విషయంలో కుమార్తె, భార్యను కొట్టాడు. దీంతో భాగ్యలక్ష్మి భర్త హత్యకు ప్లాన్ చేసింది. మూడు మేకలు ఇస్తానని మైసమ్మతో ఒప్పందం చేసుకుంది. ప్లాన్ ప్రకారం ఈ నెల 21 న ముగ్గురు కలిసి హత్య చేశారు.