లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు తుక్కు తుక్కు కానుందని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి కేవలం కొత్తగూడెం నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజారిటీ అందిద్దామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం రాత్రి కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు.