రామన్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి దేశంలో 400 సీట్లతో గెలుపొంది మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కావడం ఖాయమని భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. మంగళవారం నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డితో కలిసి ఏర్పాటు సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ ఆడుతున్న ఎన్నికల చదరంగంలో కోమటిరెడ్డి బ్రదర్స్ విలవిలలాడుతున్నారని అన్నారు.