భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులలో చిన్నలచ్చి ప్రశాంత్ అనే విద్యార్థి మంగళవారం మృతి చెందాడు. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురి కాగా.. హైదరాబాదులోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడి స్వగ్రామం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామం కాగా.. పాఠశాలలో ఐదవ తరగతిలో చేరిన విద్యార్థి ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్నాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.