ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒక కీలకఘట్టం..ప్రధాని నరేంద్ర మోడీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 09:19 PM

సెప్టెంబర్ 17 ను పురష్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశ చరిత్రలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఒక కీలకఘట్టం అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇవాళ (సెప్టెంబరు 17) మనం హైదరాబాదులో పరిఢవిల్లుతున్న ఐక్యతా స్ఫూర్తిని, దేశ సమైక్యత కోసం చేసిన త్యాగాలను సగర్వంగా స్మరించుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ ను విలీనం చేయడంలో ఆదర్శవంతమైన పాత్ర పోషించిన సర్దార్ పటేల్ కు నివాళులు అర్పిద్దామని మోదీ పిలుపునిచ్చారు.  ఈ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం హైదరాబాదులో అత్యంత ఉత్సాహంగా నిర్వహించుకోవడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని వివరించారు. ఈ మేరకు హైదరాబాదులో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న ఫొటోలను కూడా మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com