హైదరాబాద్ లో సిడబ్ల్యూసి సమావేశాలు, బహిరంగ సభ నేపథ్యంలో శనివారం పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో రైతులకు ఉచిత విద్యుత్ లేదని, తెలంగాణలో బిఆర్ఎస్ పాలనలో 24 గంటలు ఉచిత విద్యుత్ అందుతోందని అందులో ప్రచురించారు. రైతులకు లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ముద్ద పప్పు, సోనియా బలిదేవత అనే పోస్టర్లు కూడా వెలిశాయి.