సీఎం కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎంకు అనుచరుడిగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని చెప్పారు. అందుకే సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా రెండు పార్టీలు సభలు నిర్వహిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈగ వాలనివ్వడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తెలిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై పెట్టిన ఈడీ కేసులో కవిత ఇరుక్కున్నారని.. అంతేకానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేసులు పెట్టలేదన్నారు. సోనియా, రాహుల్ను ఈడీ వేధించింది కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రూ.100 కోట్లకే మంత్రులను జైలుకు పంపితే.. మరి లక్ష కోట్లు తిన్న కేసీఆర్ను ఉరేయాలంటూ ఆగ్రహించారు.