ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారు....విపక్ష నేతలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 07:26 PM

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతలపై ఇన్ని రోజులు సాధారణంగానే విమర్శలు చేసిన తలసాని ఇప్పుడు ఒక్కసారిగా టాప్ గేర్ వేసి.. ఫుల్ యాక్సిలరేటర్ ఇచ్చారు. ప్రభుత్వం మీద, సీఎం కేసీఆర్‌ మీద తీవ్ర విమర్శలు చేస్తున్న పలువురు నేతలపై ఘాటైన వాఖ్యలతో.. ఏమాత్రం ఆశ ఉంచకుండా తీసిపారేశారు. అటు బీజేపీ నేతలను.. ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో మునుపెన్నడూ లేనంతగా తిట్టిపోశారు. అయితే.. ఇటీవల తెలంగాణ సర్కార్ నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభించగా.. దానిపై విపక్ష నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. పలువురు నేతలు తలసానిపై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయటంతో.. ఆయన శివాలెత్తిపోయారు.


ఇదిలా ఉంటే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై నిప్పులు చేరిగారు తలసాని. "రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. వాడు నోటికి బట్టనే లేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను వాడు వీడు అంటున్నాడు. వాడు ఉన్నది గింతంతా.. పిసికితే ప్రాణం పోతది. నిన్న ప్రియాంక గాంధీ సభలో ఈ పొట్టోడు డిక్లరేషన్ గురించి మాట్లాడుతుండు." అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగిస్తూ.. రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు తలసాని.


మరోవైపు.. "ఈ బీజేపీ నా కొడుకులు శ్రీనివాస్ యాదవ్కు బొట్టు పెట్టడం నేర్పిస్తరట. నేను చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటున్న. వీళ్లు నాకు నేర్పిస్తరా.." అంటూ అటు మోదీని, ఇటు రాష్ట్ర బీజేపీ నాయకులపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు తలసాని. "ఆరోజు సెక్రటేరియట్ మారుద్దామని చెప్తే పెద్ద ఎత్తున గొడవలు చేశారు.. కోర్టుకు ఎక్కారు... ఈరోజు సెక్రటేరియట్ వస్తామంటూ మాట్లాడుతున్నారు. సెక్రటేరియట్ యూఎస్ వైట్ హౌస్‌లా ఉందని తలసాని యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లంతా ఎక్కడైనా గుడి కట్టారా.. ఏమైనా చేశారా.. అంటూ ప్రశ్నించారు. యాదాద్రిని సీఎం కేసీఆర్ ఎంత అభివృద్ధి చేశారో ఇప్పుడు అందరికీ తెలుసు." అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.


ఇదిలా ఉంటే.. ఈ వర్షాకాలంలో నాలాల పక్కన ఉన్న బాధితులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తలసాని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు కట్టించామన్నారు. ఇలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కానీ.. ఈ బీజీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని తలసాని యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com