ఇంటర్ ఫలితాలు విడుదలైన కాసేపటికే నిజామాబాద్ జిల్లాలో ఓ విషాద వార్త వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది, ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రజ్వల్ హైదరాబాద్లోని మాదాపూర్లో నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం ఉదయం వెల్లడైన పరీక్ష ఫలితాల్లో.. తాను ఊహించినట్లుగా మార్కులు రాకపోవడంతో ప్రజ్వల్ మనస్తాపానికి గురయ్యాడు. తల్లిదండ్రులకు తీవ్ర కడుపుకోత మిగిల్చాడు. అకడమిక్ పరీక్షల్లో ఫెయిలైనా, జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒక్క ఫెయిల్యూర్తో జీవితం ఆగిపోకూడదు. పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి. ఓటములనే సోఫానాలుగా మార్చుకొని ముందుకు సాగాలి. ఇప్పుడు విద్యార్థులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే.