మక్తల్ పట్టణంలో శ్రీ చైతన్య పేరుతో ఒక బోగస్ పాఠశాల అడ్మిషన్లు ప్రారంభించిందని పాఠశాల ప్రభుత్వ గుర్తింపు పొందకుండా కనీసం భవన అనుమతులు కూడా లేకుండా గతంలో ఒక ప్రయివేటు కళాశాల నిర్వహిస్తున్న భవనంలో పాఠశాలను నిర్వహిస్తున్నారని అన్నారు. విద్యాశాఖాధికారులు ఇలాంటి అనుమతి లేని పాఠశాలలపై దృష్టి సారించి వాటిని నిలువరించకపోతే ఎందరో విద్యార్థులు తల్లిదండ్రులు ఆర్థికంగా విద్యాపరంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నదని తెలియచేశారు. విద్యాశాఖాధికారులు తల్లిదండ్రులు కూడా పాఠశాలల గురించి నిజానిర్ధారణ చేసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలను చూసి పాఠశాలలో చేర్పించి మోసపోవద్దని అన్నారు. అదే విధంగా అలాంటి పాఠశాలలపై జిల్లా విద్యాశాఖాధికారులకు కూడా ఫిర్యాదు చేశామని విద్యాశాఖాధికారులు స్పందించి మఖ్తల్ పట్టణంలో కనీస వసతులు లేకుండా ప్రభుత్వ గుర్తింపు పొందకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ తరపున కోరుతున్నామని అన్నారు. విద్యార్థులకు నష్టం చేకూర్చే ఎలాంటి వాటిని కూడా ఏబీవీపీ ఉపేక్షించబోదని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ , జిల్లా కన్వీనర్ సురేష్ , నగర ఉపాధ్యక్షుడు వినయ్ , శరణ్ , నితిన్ తదితరులు పాల్గొన్నారు.