యాసంగి పంట నిమిత్తం రైతులు వరి పంట కోత కోసి 20 రోజులు దాటిన కొనుగోలు చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతు కల్లాలోనే కొనుగోలు చేస్తామని మాటలు చెప్పడమే తప్ప అమలు కావడం లేదు. అకాల వర్షాల వల్ల మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకటగిరి గ్రామంలో వడ్లు మొలకలు రావడం జరిగింది. త్వరతగతిన ప్రభుత్వం కల్లాలోకి వచ్చి కొనుగోలు చేయాలనీ మంగళవారం రైతులు కోరుతున్నారు.