సామాజిక న్యాయాన్ని బిఎస్పీ పార్టీ అధినేత మాయావతి తుంగలో తొక్కారని ఎమ్మెస్ ఎఫ్ పాలమూరు విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు గణేష్ అన్నారు. మంగళవారం విశ్వవిద్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సందర్భంగా మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వని బీఎస్పీ పార్టీ కి మాదిగలు తగిన బుద్ధి చెబుతామాన్నారు. తెలంగాణ భరోసా సభకు హైదరాబాద్ కు విచ్చేసిన మాయావతి మందకృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతిస్తే బీఎస్పీతో కలిసి నడుస్తామని బిఎస్పి కి అండగా ఉంటామని బహిరంగ లేఖ వ్రాసి స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ పి నాయకులు వర్గీకరణకు మద్దతు ప్రకటించాలని కోరారు.కానీ మాయావతి సోమవారం వర్గీకరణ గురించి ఊసే ఎత్తకుండా, వర్గీకరణకు మద్దతీయకుండా వెనుతిరిగింది.