రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు 150 రోజులు డెడ్ లైన్ విధించారని బిజెపి పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం అయిజ పట్టణంలోని పాత బస్టాండు సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మె చేస్తున్న పంచాయితీ కార్యదర్శులకు, వివిధ రకాల ఉద్యోగులకు సీఎం కేసీఆర్ డెడ్ లైన్ విధిస్తూ. వారిని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు తనకు విధించిన డెడ్ లైన్ ను గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.