రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సీఎం కప్ క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అయిజ ఎంపీడీవో సాయి ప్రకాష్ పేర్కొన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మండల పరిషత్తు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అయిజ మండల స్థాయిలో ఈనెల 15 నుంచి 17 వరకు వివిధ రకాల క్రీడల పోటీలను నిర్వహిస్తారని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.