కామేపల్లి మండలలోని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కామేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో రూ. 40 కోట్ల వ్యాయంతో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, ఐటిడిఏ శాఖల ఆధ్వర్యంలో నిర్మించిన, నిర్మించనున్న రహదారుల పనులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ మధ్య మంత్రి పర్యటన కొనసాగింది. కొత్తలింగాల కోట మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ నాగభూషయ్య, ఎంపీపీ సునీత, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు హనుమంతరావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.