ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని జ్యోతి నగర్ బస్తీలో కలుషిత మంచినీరు, మరియు డ్రైనేజ్ సమస్యలపై ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్కు బస్తీవాసులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ.. వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కరిస్తానని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయి కృష్ణ, మాజీ కార్పొరేటర్ రవీందర్, ప్రభాకర్, పాస్పోర్ట్ శ్రీనివాస్, సందీప్, ఎల్లయ్య, లక్ష్మణ్, రవీందర్ చారి తదితరులు పాల్గొన్నారు.