ఎంసెట్ రాసే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ రిజల్ట్ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పిల్లలు ఒత్తిడికి గురి కావొద్దని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే జేఈఈ మెయిన్, నీట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ తాజాగా ఎంసెట్ లోనూ ఇంటర్ వెయిటేజీ తొలగిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.