ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించామన్నారు. పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలు, టైం టేబుల్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆవేశాలకు లోను కావొద్దని, మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావాలని సూచించారు.