రామాయంపేట ను రెవెన్యూ డివిజన్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం నాటికి 43వ రోజు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రామాయంపేట పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల మండలాల ప్రజలు రెవెన్యూ డివిజన్ కోరుకుంటున్నారు, కాబట్టి వేణు వెంబటే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఇచ్చి ప్రజల కోరికలను నెరవేర్చాలని అన్నారు. లేనియెడల రాబోయే జనరల్ ఎన్నికలలో మీరు రామాయంపేట చుట్టుపక్కల ప్రాంతాలలో, మా డివిజన్ పరిధి ప్రాంతంలో ఎన్నికలు జరగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పాల్గొన్నారు.