గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో వివిధ శాఖలకు చెందిన వింగ్ అధికారులు వినతులు స్వీకరించారు. నగర ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేశారు. నగర ప్రజలు అందజేసిన సమస్యల పరిష్కార దిశగా విధులు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.