ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 06:57 PM

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వామివారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ప్రాయశ్చిత్త దీక్ష విరమించారు. మంగళవారం రాత్రి అలిపిరి నడకమార్గం నుంచి తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్.. బుధవారం వీఐపీ విరామ దర్శన సమయంలో కుమార్తెలు ఆద్య కొణిదెల, పోలెనా అంజనా కొణిదెలతో కలసి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. దర్శనానికి ముందు చిన్నకుమార్తెతో డిక్లరేషన్ అందించారు. అయితే పవన్ కళ్యాణ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తే సామాన్య భక్తులకు ఇబ్బంది అనే ఆలోచనలతో అధికారులు మహాద్వారం గుండా పంపించారు. దీంతో మహాద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్లిన పవన్ కళ్యాణ్.. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి డిక్లరేషన్ శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం అందించి.. తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్.. సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com