జగిత్యాల జిల్లా బీర్పూర్ లో ప్రజా ప్రతినిధులకు బెదిరింపు లేఖలు రాసిన ఇద్దరు నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలొ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలతో కలకలం సృష్టించగా పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారని వారిని అభినందించారు. అరెస్ట్ అయిన వారి లో లక్ష్మి రాజాం గతంలొ మావోయిస్టు అతని స్వగ్రామం బీర్పూర్ మండలం నరసింహుల పల్లె, మరొక నిందితుడు అశోక్ సిరిసిల్లకు చెందిన వ్యక్తి అన్నారు.