వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం గ్రామానికి చెందిన హరిజన్ కురుమయ్య, భాగ్యమ్మ దంపతుల కుమార్తెలు తిరుపతమ్మ (14), సంధ్య (12), దీపిక (10), తల్లిదండ్రులు ఉపాధి హామీ పథకంలో పని చేయడానికి వెళ్లగా, గ్రామ సమీపంలోని బట్టలు ఉతకడానికి వీరసముద్రం చెరువుకు వెళ్లారు. మొదటగా దీపిక నీటిలో మునిగిపోతుండగా కాపాడడానికి సంధ్య వెళ్ళింది. సంధ్య కూడా నీటిలో మునిగి పోవడంతో పెద్దకూతురు తిరుపతమ్మ వాళ్లను కాపాడడానికి వెళ్లడంతో ముగ్గురు అక్క చెల్లెలు నీటిలో మునిగి ఈత రాకపోవడంతో ఊపిరాడక చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.