ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళ ఇంట్లో చొరబడ్డ దొంగలు.. బంగారం దోచుకుని, ఆపై గ్యాంగ్ రేప్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 10:12 PM

దేశంలో నిత్యం ఏదో ఓ మూల.. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుండగా.. నిందితులకు శిక్షలు కూడా పడుతున్నాయి. అంతేకాకుండా మహిళలపై జరుగుతున్న ఈ అకృత్యాలకు వ్యతిరేకంగా ఎన్నో నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయినా కొందరు మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా దొంగతనం కోసం వెళ్లిన కొందరు దుండగులు.. దోచుకున్న తర్వాత.. ఆ ఇంటి యజమానిపై సామూహిక అత్యాచారం చేశారు. ఒడిశాలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.


ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. నగరంలోని మైత్రి విహార్‌లో ఓ 27 ఏళ్ల మహిళ తన రెండేళ్ల కుమార్తెతో నివాసం ఉంటోంది. గత నెల 30వ తేదీన తెల్లవారుజామున 2 గంటలకు ఆమె ఉండే అపార్ట్‌మెంట్‌లోకి కొందరు ఆగంతకులు చొరబడ్డారు. అనంతరం ఆ మహిళకు కత్తి చూపించి బెదిరించి.. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత డబ్బులు, బంగారం, ఇతర ఆభరణాలు కూడా చోరీ చేశారు. అయితే అంతటితో ఆగని ఆ దుండగులు.. ఆ మహిళపై కన్నేశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు.


దుండగులను ఆమె నిలువరించింది. అయితే పక్కనే ఉన్న ఆమె 2 ఏళ్ల కుమార్తెను చంపేస్తామని బెదిరించిన ఆ ఆగంతకులు.. ఆమెను లొంగదీసుకుని.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఆ మహిళ.. వారి ముందు లొంగిపోయింది. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఆ దారుణం నుంచి తేరుకున్న తర్వాత ఆ మహిళ.. దగ్గర్లో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.


బాధిత మహిళ స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ 10 రోజుల క్రితమే ఆ అపార్ట్‌మెంట్‌లోకి వచ్చినట్లు వెల్లడించారు. వెదురు కర్రల సాయంతో దొంగలు ఆ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ అపార్ట్‌మెంట్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలించి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com