ప్రజావాణి ద్వార వచ్చిన ఫిర్యాదులు పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. స్వయంగా బాధితులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబందిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.