తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల కు జాతర లు నిదర్శనం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం నడిగూడెం మండలంలోని నారాయణపురంలో గంగమ్మ తల్లి జాతర కు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2014 కు ముందు రాష్ట్రం లో జరిగే జాతరలను పట్టించుకున్న నాథుడే లేరన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా జరిగే జాతర లకు ప్రభుత్వ ప్రాధాన్యత లభించింది అన్నారు. మతాలకు అతీతంగా ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం అనేది తెలంగాణ లో మినహా మరెక్కడా లేదన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు. ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు. దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ పుట్ట రమేష్, బిఆర్ఎస్ నాయకులు గార్లపాడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నాగేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు నాగేందర్, నాయకులు వీరబాబు, యాదవ కుల పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.