కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి స్పష్టమైన కంటిచూపు అందించాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని తీసుకువచ్చినందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవికుమార్ కోరారు. ఈరోజు హుజూర్నగర్ 25వ వార్డు నందు నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని వార్డ్ కౌ న్సిలర్ అస్మా నసిర్తో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ మున్సిపల్ సిబ్బందితో కంటి వెలుగు కార్యక్రమం తుది దశకు చేరుకున్నందున ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.